- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు టాప్ కమాండర్ హిడ్మా దళం కర్రెగుట్టల్లో తలదాచుకున్నట్లు ఇంటెలిజెన్స్ సమాచారం అందింది. దీంతో భద్రతా అధికారులు అలర్ట్ అయ్యారు. థర్మల్ సెన్సార్ డ్రోన్ కెమెరాల్లో మావోయిస్టుల కదలికలు రికార్డయ్యాయి. ఈ నేపథ్యంలో సుమారు 5 వేలమంది కేంద్ర సాయుధ బలగాలు కర్రెగుట్టల పరిసరాల్లో విస్తృత కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి.
- Advertisement -



