నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, వరంగల్, హనుమకొండ, మహబూబ్నగర్, జనగామ, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షం కురిసే వీలుందని తెలిపింది. దీంతో ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.
బుధవారం అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. యాదాద్రి భువనగిరి, మహబూబ్నగర్, హనుమకొండ, జనగామ, వరంగల్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడతాయని పేర్కొంటూ వాతావరణశాఖ ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది.
తెలంగాణలో ఈరోజు, రేపు భారీ వర్షాలు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES