- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: అస్సాంలో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. వరదలు, కొండచరియలు విరిగిపడటం వలన ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు ఆదివారం ధృవీకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు, రైలు సేవలకు అంతరాయం కలిగింది. ఈ వరదల కారణంగా 15కి పైగా జిల్లాల్లో 78,000 మందికి పైగా ప్రజలు ప్రభావితమయ్యారు. బ్రహ్మపుత్ర, బరాక్ సహా పది ప్రధాన నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయని కేంద్ర జల సంఘం హెచ్చరికలు జారి చేసింది. ఈ మేరకు రాష్ట్రానికి ‘ఆరెంజ్ బులెటిన్’ జారీ చేసింది.
- Advertisement -