Tuesday, August 5, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంఇండియాపై భారీగా సుంకాలేస్తా..

ఇండియాపై భారీగా సుంకాలేస్తా..

- Advertisement -

డోనాల్డ్‌ ట్రంప్‌ సంచలన కామెంట్స్‌
వాషింగ్టన్‌:
యూఎస్‌కు భారతదేశం చెల్లించే సుంకాలను భారీ స్థాయిలో పెంచుతామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పేర్కొన్నారు. రష్యా నుంచి చమురు భారీ మొత్తంలో కొనుగోలు చేసి, పెద్ద లాభాలకు భారత్‌ అమ్ముకుంటోందని ట్రంప్‌ ఆరోపించారు. ”భారత్‌ భారీ మొత్తంలో రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోంది. అంతేకాదు అలా కొనుగోలు చేసిన చమురులో ఎక్కువ భాగాన్ని ఓపెన్‌ మార్కెట్లో భారీ లాభాలకు విక్రయిస్తోంది” అని ట్రంప్‌ తన సోషల్‌ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు. ”రష్యా చేస్తున్న యుద్ధం వల్ల ఉక్రెయిన్‌లో ఎంత మంది చనిపోతున్నారో, వారికి పట్టింపులేదు. అందుకే భారతదేశం, అమెరికాకు చెల్లించే సుంకాన్ని నేను గణనీయంగా పెంచుతాను” అని ట్రంప్‌ అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -