నవతెలంగాణ – హైదరాబాద్: ఉత్తరాఖండ్లోని చార్ధామ్ యాత్రా మార్గంలో హెలికాప్టర్ ప్రమాదాలు కొనసాగుతున్నాయి. తాజాగా శనివారం ఉదయం కేదార్నాథ్కు యాత్రికులను తీసుకెళుతున్న ఒక ప్రైవేట్ సంస్థకు చెందిన హెలికాప్టర్ రుద్రప్రయాగ్ జిల్లాలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఈ ఘటనలో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. గడిచిన నెల రోజుల వ్యవధిలో చార్ధామ్ మార్గంలో ఇది నాలుగో హెలికాప్టర్ సంబంధిత ఘటన కావడం గమనార్హం. వివరాల్లోకి వెళితే, శనివారం ఉదయం సిర్సి హెలిప్యాడ్ నుంచి ఐదుగురు యాత్రికులతో ఒక ప్రైవేట్ హెలికాప్టర్ కేదార్నాథ్కు బయల్దేరింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే, బడాసు ప్రాంతంలో హెలికాప్టర్ను అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో హెలికాప్టర్ తోక భాగం విరిగిపోయింది. అయితే, ఈ ఘటనలో ఐదుగురు యాత్రికులతో సహా ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు స్పష్టం చేశారు. ఫాటా, గుప్తకాశీలతో పాటు సిర్సి హెలిప్యాడ్ నుంచి కూడా కేదార్నాథ్కు యాత్రికులను హెలికాప్టర్ల ద్వారా చేరవేస్తుంటారు.
కేదార్ నాథ్ వద్ద హెలికాప్టర్ క్రాష్ ల్యాండింగ్.. ఐదుగురు..!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES