- Advertisement -
– ఎస్.హెచ్.ఓ యయాతి రాజు
నవతెలంగాణ – అశ్వారావుపేట
ద్విచక్ర వాహనదారులు తప్పని సరిగా హెల్మెట్లు ధరించాలని,అనుకోని పరిస్థితుల్లో ప్రమాదం సంభవిస్తే హెల్మెట్ ప్రాణాధారం గా ఉంటుందని ఎస్.హెచ్.ఓ ఎస్సై యయాతి రాజు హెచ్చరించారు. రహదారి భద్రతా అవగాహన మాసం – 2026 లో భాగంగా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు శనివారం అశ్వారావుపేట – భద్రాచలం రహదారిలో ప్రమాదాలను నివారించడానికి అవగాహన కార్యక్రమం చేపట్టారు. అందులో భాగంగా ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ఆవశ్యకత,సరైన నెంబర్ ప్లేట్ కలిగి లేకపోవడం వంటి వాటిపై కలిగే అనర్ధాలు,చట్టపరమైన చర్యల ను వివరించారు. కార్యక్రమంలో ఎస్సై అఖిల, సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -



