- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణ పద్మశాలి సంఘం నుండి సర్వసమాజ్ ప్రతినిధిగా ఎన్నికైన కొక్కుల విద్యాసాగర్ ని ఈ.ఆర్.ఫౌండేషన్ చైర్మన్, చార్టెడ్ అకౌంటెంట్ ఈరవత్రి రాజశేఖర్ శనివారం ఈ.ఆర్ ఫౌండేషన్ కార్యాలయంలో సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యాసాగర్ మంచి సేవా కార్యక్రమాలు,రక్త దానా శిబిరాలు నిర్వహించారు అని కొనియాడారు. పట్టణ పద్మశాలికే గాకుండా కొత్తగా ఎన్నికైన పట్టణ సర్వసామాజ్ కు కూడా మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మర్కా శరత్ చంద్రా గౌడ్, మంతెన నర్సయ్య, డిష్ రాంప్రసాద్, మేకల సురేష్, చెన్న చందు, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -