Sunday, August 10, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినికి సన్మానం 

అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినికి సన్మానం 

- Advertisement -

నవతెలంగాణ – రామారెడ్డి : పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో 596 మార్కులు సాధించి రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచిన నిమ్మ అంచితను మంగళవారం జిల్లా పరిషత్ మాజీ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి పలువురితో కలిసి కామారెడ్డిలో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాసస్థాయిలో మొదటి స్థానంలో నిలిచినందుకు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మంచి చదువులు చదివి, ఉన్నత స్థానంలో స్థిరపడాలని, తల్లిదండ్రులకు, గురువులకు, పుట్టిన గడ్డకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు గీ రెడ్డి మహేందర్ రెడ్డి, నరాల శ్రీనివాస్ రెడ్డి, రగోతం రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img