- Advertisement -
నవతెలంగాణ-రామారెడ్డి
సమాజ నిర్మాణంలో విద్యార్థులను తీర్చిదిద్ది ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి ఉపాధ్యాయుల పాత్ర ఎనలేనిదని మండల విద్యాశాఖ అధికారి ఆనంద్ రావు అన్నారు. మండలంలోని 39 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు శాలువాలతో సన్మానించి, జ్ఞాపకంలతోపాటు ప్రశంస పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా పాల్గొని ఉత్తమ ఉపాధ్యాయులు మాట్లాడుతూ… సంతోషాన్ని వ్యక్తం చేశారు. మరింత బాధ్యతగా విద్యార్థులకు మెరుగైన విద్యను అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఆయా పాఠశాల ఉపాధ్యాయులు, సి ఆర్ పి లు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -