నవతెలంగాణ – జుక్కల్: జుక్కల్ మండలంలోని బంగారు పల్లి మోడల్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు స్లాబు వేసి పూర్తిచేసిన లబ్ధిదారులకు సోమవారం జుక్కల్ మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ కమిటీ సభ్యులతో సమావేశమై ఎంపీడీవో ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇండ్ల పథకం గ్రామ కమిటీ సభ్యులు కలిసి ఇందిరమ్మ ఇండ్ల పథకంలో నిర్మాణాలు చేస్తున్న గంగవ్వ, రేణుక అనే లబ్ధిదారులకు శాలువాతో వారి గ్రామమైన బంగారు పల్లిలో సన్మానించారు. ఈ సందర్భంగా జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్ మాట్లాడుతూ.. మండలంలోని గ్రామాలలో ఇప్పటికే ఇందిరమ్మ పథకంలో మంజూరైన ఇండ్ల నిర్మాణాలు వేగవంతంగా కొనసాగుతున్నాయని తెలిపారు. కొన్ని ముగ్గు వేసి ప్రారంభించగా అన్నారు. ఇంకొన్ని పునాది దశలో, పిల్లర్ దశలో , గోడల నిర్మాణాల దశలో ఇంకొన్ని స్లాబ్ దశలో పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఇండ్ల నిర్మాణాలు వాటిని త్వరిత గతిగా పూర్తి చేసేందుకు నిత్యం గ్రామాల సందర్శన చేస్తున్నామని తెలిపారు. లబ్ధిదారులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించి ఏవైనా సమస్యలు తలెత్తితే వాటిని గుర్తించి వెనువెంటనే పరిష్కరించామని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని లక్ష్యంతో మండల పరిషత్ సిబ్బంది కార్యాచరణ ఏర్పాటు చేసి పనులను విజయవంతంగా కొనసాగిస్తుంది పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో తో పాటు ఇందిరమ్మ పథకం గ్రామ కమిటీ సభ్యులు , జిపి వర్కర్ దేవిదాస్, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు సన్మానం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES