- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో గత 25 సంవత్సరాల నుంచి నమ్మకంగా ఉంటూ.. సుమారుగా రూ.80 లక్షల పైన డబ్బులు తీసుకొని ఉడాయించిన సంఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్ కు చెందిన కరణ్, చరణ్ అనే అన్నదమ్ములు గత 25 సంవత్సరాల క్రితం భార్య, పిల్లలతో వచ్చిహోటల్ నిర్వహిస్తూ ఉన్నారు. స్థానికులతో పాటు చుట్టుపక్కల వారి దగ్గర నమ్మకంగా ఉంటూ డబ్బులతో పరారయ్యారు. రోజువారి కలెక్షన్ తో పాటు మరికొందరి దగ్గర పెద్ద మొత్తంలో తీసుకొని పరారయ్యారు. దీంతో బాధిత వ్యక్తులు ఆందోళనకు గురయ్యారు.
- Advertisement -


