- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : మహారాష్ట్రలోని పాలఘర్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. జేపీ పరిశ్రమల నగరంలోని లింబాని సాల్ట్ ఇండస్ట్రీస్ కంపెనీలో కెమికల్ ప్రాసెస్ జరుగుతున్న సమయంలో ఆకస్మికంగా భారీ పేలుడు సంభవించింది. ఈ బ్లాస్ట్లో ఓ కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే కంపెనీ పరిసరాల్లో భయాందోళన వాతావరణం నెలకొంది. గాయపడిన కార్మికులను సమీపంలోని ఢవలే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై పాలఘర్ జిల్లా పోలీసు అధికారి మాట్లాడుతూ.. మానోర్ రోడ్డులోని ఈ యూనిట్లో కెమికల్ ప్రాసెసింగ్ జరుగుతున్నప్పుడు పేలుడు జరిగిందని తెలిపారు.
- Advertisement -