- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: చైనాలో కోతుల కొరత తీవ్రమైంది. వైద్య పరిశోధనల కోసం క్లినికల్ ట్రయల్స్లో కోతులు అవసరం కావడంతో వాటికి డిమాండ్ పెరిగింది. దీంతో కోతుల ధర రూ.20-25 లక్షలకు చేరుకుంది. 2025లో ప్రారంభం కానున్న కొత్త బయో ప్రాజెక్టుల వల్ల ఈ కొరత మరింత పెరిగే అవకాశం ఉంది. దీనికి విరుద్ధంగా భారతదేశంలో కోతుల బెడదతో గ్రామీణ ప్రాంతాలు ఇబ్బందులు పడుతున్నాయి. తెలంగాణలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కోతుల బెడద నివారణ ఒక ఎన్నికల వాగ్దానంగా మారింది.
- Advertisement -



