- Advertisement -
మూడు దఫాల ఈ-వేలంలో ప్రభుత్వ ఖజానాకు రూ.3700 కోట్లు
గతం కంటే 87శాతం రెట్టింపు ధర
5న మరోసారి ఈ-వేలం
నవతెలంగాణ-హైదరాబాద్(హెచ్ఎమ్డీఏ)
రంగారెడ్డి జిల్లాలోని కోకాపేట ప్రాంతంలో నియోపొలిస్ ఈ-వేలం ద్వారా ప్రభుత్వ ఖజానాకు భారీగానే ఆదాయం వస్తోంది. గతంతో పోల్చితే 87 శాతం రెట్టిపు స్థాయిలో ఈ భూముల ధర పలికింది. ఇటీవల మూడు దఫాలుగా వేసిన ఈ వేలం ద్వారా ప్రభుత్వానికి రూ.3708 కోట్ల ఆదాయం వచ్చింది. బుధవారం మూడో దఫా నిర్వహించిన వేలంలో ప్లాట్ నెం.19ను యులా కన్స్టక్షన్స్, గ్లోబస్ ఇన్ఫ్రాకాన్ సంస్థలు ఎకరాకు రూ.131 కోట్లతో దక్కించుకున్నాయి. ప్లాట్ నెం.20ను బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ ఎకరాకు రూ.118 కోట్లతో ప్లాట్ సొంతం చేసుకున్నాయి.
- Advertisement -



