నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో ఏర్పాటు చేసిన వివిధ ప్రభుత్వ స్టాళ్లు, కార్పొరేట్ కంపెనీల స్టాళ్లను గురువారం ప్రజలు, విద్యార్థినీ, విద్యార్థులు భారీగా సందర్శించారు. ఉదయం నుంచే సందడి మొదలైంది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ రెండోరోజు కార్యక్రమాలు ”డిస్కవర్ తెలంగాణ : కల్చరల్ హెరిటేజ్ అండ్ నెక్ట్స్-జెన్ టూరిజం” అనే సదస్సుతో ప్రారంభమైంది. వివిధ కాలేజీల నుంచి వచ్చిన విద్యార్థులు వందలాదిగా ఈ సదస్సులో పాల్గొని తమ అభిప్రా యాలను వెల్లడించారు. తెలంగాణ చరిత్ర, మ్యూజియం సంస్కృతి, పర్యాటక అభివృద్ధి, ఆహార సంస్కృతి తదితర విభిన్న కోణాల్లో విలువైన విశ్లేషణలను వక్తలు వివరించారు. తెలంగాణను ప్రపంచస్థాయిలో ఒక సాంస్కృతిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే అవకాశాలను వీరు వివరించారు
ఈ సదస్సులో డా. మామిడి హరికష్ణ, బిరద్ రాజారామ్, పి. పద్మావతి, గోపీ బైల్లుప్పాల పాల్గొని మాట్లాడారు. అనంతరం ‘తెలంగాణ రైజింగ్- ఎంపవరింగ్ ఆల్, గ్రోవింగ్ టుగెదర్’ అనే సదస్సులో ప్రముఖులు విద్యార్థులతో సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం రెండేండ్లుగా చేపట్టిన ప్రగతిని తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలపై క్లుప్తంగా వివరించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఏరోస్పేస్, మూసీ రివర్ డెవలప్మెంట్, హ్యాండీ క్రాఫ్ట్స్, టూరిజం, ఎడ్యుకేషన్, కరీంనగర్ ఇక్కత్, ఫిలిగ్రి, చేర్యాల పెయింటింగులు, సైబర్ క్రైమ్ చెదనలో ఉపయోగించే పలు ఆధునాతన పరికరాలు,డ్రోన్లు, రోబో తదితర 27కు పైగా స్టాళ్లను సందర్శకులు ఆసక్తిగా తిలకించారు. ప్రధానంగా, ఆధునిక పరికరాలు, వైమానిక అంశాలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. కాగా, రేపు శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటలవరకు సందర్శించవచ్చని నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు.
గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణానికి రెండోరోజూ భారీగా సందర్శకులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



