- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: గోషామహల్ నియోజకవర్గం పరిధిలోని కుల్సుంపురాలో జరిగిన ఆక్రమణలను తొలగించి, 1.30 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా స్వాధీనం చేసుకుంది.ఈ నేపథ్యంలో, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఈ భూమిని పరిరక్షించాల్సిందిగా హైడ్రాను కోరారు. స్థానికులు కూడా భూ ఆక్రమణలపై హైడ్రాకు ఫిర్యాదు చేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు శుక్రవారం హైడ్రా సిబ్బంది ఆక్రమణలను తొలగించారు.
అయితే, అశోక్ సింగ్ అనే వ్యక్తి ఈ భూమి తనదని వాదిస్తున్నాడు. ఈ క్రమంలో, సిటీ సివిల్ కోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వెలువరించింది. ఇదివరకే రెవెన్యూ అధికారులు రెండుసార్లు ఈ భూమిలో ఆక్రమణలను తొలగించారు.
- Advertisement -