2001 నుండి తెలంగాణ ఉద్యమంలో నాయకత్వం వహించా
ఎన్నో ఉద్యమాలు, ధర్నా రాస్తారోకోలు, వంట వార్పు ముందుండి నడిపించా
తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర సమితి అధ్యక్షులు
పెండం సర్వేశం
నవతెలంగాణ – జమ్మికుంట : 2001 నుండి2014 వరకు కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఉద్యమంలో అంకితభావంతో పాల్గొని తన వంతు ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లడం జరిగింది. నేను భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాల రామకృష్ణపూర్ గ్రామంలో జన్మించాను. ఆర్ఎంపీ డాక్టర్ గా పనిచేస్తూ, సమాజ సేవే పరమావధిగా అభ్యుదయ భావజాలం కలిగి ఉన్న నేను ప్రజలకు సేవ చేస్తున్న తరుణంలో తెలంగాణ ఉద్యమం రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రము సిద్ధించడం వలన కలిగే ప్రయోజనాలను తెలిసిన వ్యక్తిగా మండల టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉండి, ప్రజలను చైతన్య పరుస్తూ ఉద్యమంలో పాల్గొ నే విధంగా చేయడం జరిగింది. 2001 నుండి 2006 వరకు టేకుమట్ల మండల నాయకునిగా ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లడం జరిగింది. అన్ని గ్రామాల్లో నా సొంత ఖర్చుతో తెలంగాణ జెండా గద్దెలను నిర్మించాను. 2006 నుండి ఇప్పటివరకు జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ధర్మారం గ్రామంలో స్థిర నివాసము ఏర్పరచుకున్నాను. గత 19 సంవత్సరాలుగా కొత్తపల్లిలోని బాలాజీ చేనేత సహకార సంఘం అధ్యక్షులుగా కొనసాగుతున్నాను. జమ్మికుంట మండలంలో కూడా సకల జనుల సమ్మె, వంటావార్పు ,రిలే నిరాహార దీక్షలు, ధర్నా, రాస్తారోకోలు, ఉద్యమాలు చేయడం జరిగింది. మొదట్లో ఉద్యమంలో చాలా తక్కువ మంది పాల్గొనే వారని ,నేను చాలా చురుకుగా నాయకత్వం వహించి ఉద్యమాలు చేయడం జరిగిందని తెలిపారు. కెసిఆర్ ఉద్యమాలు చేయడం వలన తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది.
అంకితభావంతో తెలంగాణ ఉద్యమం చేశా..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES