- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
తాను నామినేషన్ వేసినప్పుడే ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు సరైన పత్రాలనే సమర్పించానని మండలంలోని కొండంపేట 8వ వార్డులో వార్డు సభ్యుడిగా పోటీచేస్తున్న ఇట్ఠవెన శరత్ సోమవారం వళ్లెంకుంట రిటర్నింగ్ అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను పోటీ చేస్తున్న వార్డులో నామినేషన్ కు, ప్రతిపాదనలకు సంబంధించిన పత్రాలను నామినేషన్ చెసినప్పుడే సమర్పించినట్లుగా తెలిపారు.
- Advertisement -



