తహసిల్దార్ సదానంద
నవతెలంగాణ – ధర్మసాగర్
ప్రజలందరికీ న్యాయం జరిగేలా నా వంతు కృషి చేస్తానని తాసిల్దార్ సదానందం అన్నారు. మంగళవారం మండలంలోని సోమదేవరపల్లి గ్రామంలో నిర్వహించిన భూభారతి రెవిన్యూ సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామంలో 95 దరఖాస్తులు అందాయి. వీటిలో 2 దరఖాస్తులను సకాలంలో పరిష్కరించడం జరిగింది. ఈ సమావేశంలో ఎక్కువగా సాదా బైనమా కేసులు ఉండగా, 4 సక్సేషన్ కేసులు మరియు 4 ఆర్ ఓ ఆర్ ఆపిల్ కేసులు కూడా నమోదయ్యాయని తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలు ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ రెవిన్యూ అధికారులు గ్రామ ప్రజలతో సమన్వయం చేస్తూ, సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు. ఇటువంటి సదస్సులు ప్రజల సమస్యలపై అర్థం చేసుకోవడానికి మరియు స్పందించడానికి మంచి అవకాశాలు ఉన్నాయని అన్నారు. ప్రజలందరూ ఈ సదా అవకాశాన్ని గ్రామ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని వారు అభిప్రాయపడ్డారు.ఈ సదస్సు విజయవంతంగా నిర్వహించబడటంపై సంబంధిత అధికారులు మరియు గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.కార్యక్రమంలో నాయబ్ తహసీల్దార్ సంతోష్ కుమార్, ఇతర ఇద్దరు గిర్దవారులు మరియు ఇతర సిబ్బందీ పాల్గొన్నారు.
న్యాయం జరిగేందుకు కృషి చేస్తా..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES