Thursday, June 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్న్యాయం జరిగేందుకు కృషి చేస్తా..

న్యాయం జరిగేందుకు కృషి చేస్తా..

- Advertisement -

తహసిల్దార్ సదానంద
నవతెలంగాణ – ధర్మసాగర్
ప్రజలందరికీ న్యాయం జరిగేలా నా వంతు కృషి చేస్తానని తాసిల్దార్ సదానందం అన్నారు. మంగళవారం మండలంలోని సోమదేవరపల్లి గ్రామంలో నిర్వహించిన భూభారతి రెవిన్యూ సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామంలో 95 దరఖాస్తులు అందాయి. వీటిలో 2 దరఖాస్తులను సకాలంలో పరిష్కరించడం జరిగింది. ఈ సమావేశంలో ఎక్కువగా సాదా బైనమా కేసులు ఉండగా, 4 సక్సేషన్ కేసులు మరియు 4 ఆర్ ఓ ఆర్ ఆపిల్ కేసులు కూడా నమోదయ్యాయని తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలు ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ రెవిన్యూ అధికారులు గ్రామ ప్రజలతో సమన్వయం చేస్తూ, సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు. ఇటువంటి సదస్సులు ప్రజల సమస్యలపై అర్థం చేసుకోవడానికి మరియు స్పందించడానికి మంచి అవకాశాలు ఉన్నాయని అన్నారు. ప్రజలందరూ ఈ సదా అవకాశాన్ని గ్రామ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని వారు అభిప్రాయపడ్డారు.ఈ సదస్సు విజయవంతంగా నిర్వహించబడటంపై సంబంధిత అధికారులు మరియు గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.కార్యక్రమంలో నాయబ్ తహసీల్దార్ సంతోష్ కుమార్, ఇతర ఇద్దరు గిర్దవారులు మరియు ఇతర సిబ్బందీ పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -