- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. గతంలో ఆమ్రపాలిని తెలంగాణకి కేటాయించాలని సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టు స్టే విధించింది. క్యాట్ జారీ చేసిన ఈ ఉత్తర్వులను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆమెను కేటాయింపు విషయంలో తాత్కాలికంగా అడ్డంకి ఎదురైంది. ఈ క్రమంలో హైకోర్టు ఐఏఎస్ ఆమ్రపాలికి కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది. అనంతరం ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణను 6 వారాలకు వాయిదా వేస్తున్నట్లు కోర్టు తెలిపింది.
- Advertisement -



