Tuesday, December 2, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంసర్పంచ్‌ అయ్యాక నా ఆస్తులు పెరిగితే.. అవి ప్రజలకే

సర్పంచ్‌ అయ్యాక నా ఆస్తులు పెరిగితే.. అవి ప్రజలకే

- Advertisement -

– బాండ్‌ పేపర్‌ రాసిచ్చిన సర్పంచ్‌ అభ్యర్థి
– తుంగతుర్తి మండల కేంద్రంలో ఘటన
నవతెలంగాణ-తుంగతుర్తి

సర్పంచ్‌గా గెలిచాక నా ఆస్తులు పెరిగితే అవి గ్రామపంచాయతీకి రాసిస్తానని గుడితండా సర్పంచ్‌ అభ్యర్థి గుగులోతు జయపాల్‌ నాయక్‌ అన్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే యువకులకు అవకాశం కల్పించాలన్నారు. సర్పంచ్‌గా గెలిచాక, తన ఆస్తులు పెరిగితే గ్రామపంచాయతీకి రాసిస్తానని బాండ్‌ పేపర్‌పై రాసి సమర్పించారు. గ్రామ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని, ప్రజలకు సేవకుడినై పనిచేస్తానని, తప్పుడు లెక్కలు చూపించబోనని అన్నారు. అమూల్యమైన ఓటు వేసి ఆశీర్వదించి గెలిపించాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -