- Advertisement -
నవతెలంగాణ హైదరాబాద్: తుది దశ తెలంగాణ ఉద్యమ ఫలితంగా రాష్ట్ర ఏర్పాటుకు తొలి అడుగుపడిన రోజు డిసెంబర్ 9 విజయ్ దివస్ అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. డిసెంబర్ 9 లేకపోతే జూన్ 2 లేదని తెలిపారు.
సబ్బండ వర్గాల పోరాటం, అమరుల త్యాగం, కేసీఆర్ నిరవధిక నిరాహార దీక్షతో ఢిల్లీ పీఠం వణికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించి నేటికి 16 ఏండ్లని తెలిపారు. నవంబర్ 29న దీక్షా దివస్ లేకుంటే డిసెంబర్ 9 విజయ్ దివస్ లేదన్న ఆయన.. డిసెంబర్ 9 లేకపోతే జూన్ 2 లేదని అన్నారు. విజయ్ దివస్ సందర్భంగా ఆయన ఎక్స్లో.. కేసీఆర్ దీక్ష విరమించిన ఫోటోలు పంచుకున్నారు.
- Advertisement -



