– ఆర్మూర్ డివిజన్ షీ టీమ్ ఇంచార్జిలు విగ్నేష్, సుమతి
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
ఇవ్ టీజింగ్ చేస్తే షీ టీంకు సమాచారం ఇవ్వాలని ఆర్మూర్ డివిజన్ షీ టీమ్ ఇంచార్జిలు విగ్నేష్, సుమతి అన్నారు. గురువారం మండలంలోని హస కొత్తూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సమాజంలో జరుగుతున్న సంఘటనలపై, సైబర్ క్రైమ్ గురించి అవగాహనా కల్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఎవరైనా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన, ఈవ్ టీజింగ్ చేసిన షీ టీంకు సమాచారం ఇవ్వాలని కోరారు. విద్యార్థినిలు, ఉద్యోగినిలు, మహిళలు ఈవ్టీజింగ్, వేధింపులకు గురైతే పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన షీ టీంకు సమాచారం ఇవ్వాలన్నారు.
సమాచారం ఇచ్చిన మహిళలు, విద్యార్థినిల పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందని తెలిపారు.ఈవ్ టీజింగ్కు గురయ్యేవారు భయపడకుండా సమాచారం ఇస్తే రక్షణ కల్పిస్తామన్నారు. ఈ సందర్బంగా షీ టీం నెంబర్ 8712659795కు, డయల్ 100 నెంబర్ లను తెలిపి దానికి సమాచారం ఇవ్వాలని సూచించారు. క్యూ ఆర్ కోడ్ ద్వారా షీ టీంకు ఫిర్యాదు చేసే విధానాన్ని మహిళలకు వివరించారు. ప్రతీ రోజు తప్పనిసరిగా కనీసం ఐదు నిముషాలు ఇంట్లో తల్లిదండ్రులతో మాట్లాడాలని తద్వారా అన్ని విషయాలు వారితో పంచుకునే అవకాశం ఏర్పడుతుందని విద్యార్థులకు సూచించారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు అరుణ శ్రీ, సీనియర్ ఉపాధ్యాయులు కృష్ణ కుమార్,, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.



