- Advertisement -
నవతెలంగాణ – గండీడ్
మండలంలోయథేచ్ఛగా మట్టి అక్రమ తవ్వకాలు కొనసాగుతున్నాయి. పగిడ్యాల గ్రామ సమీపంలోని ప్రభుత్వ భూమి మురుగుట్టలో ఎలాంటి అనుమతి లేకుండా జేసీబీ సహాయంతో మొర్రం తరలిస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపంతో ధనార్జనే ధ్యేయంగా సహజ సంపదైన మట్టిని కొల్లగొడుతూ లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని దోచుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ అధికారులు అటువైపు చూడకపోవడం విడ్డూరమని వాపోతున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి, అక్రమ మట్టి దందా నివారించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
- Advertisement -