- Advertisement -
నవతెలంగాణ- దుబ్బాక: పటిష్ట బందోబస్తు నడుమ వినాయక విగ్రహాల నిమజ్జనానికి పోలీసు శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని సీఐ పాలెపు శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం దుబ్బాకలోని సీఐ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. పట్టణంలోని పెద్ద చెరువు కట్ట వద్ద క్రేన్ తోపాటు గజ ఈతగాళ్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మున్సిపల్, పోలీసు అధికారుల సూచనలను పాటిస్తూ శాంతియుతంగా నిమజ్జనాన్ని జరుపుకోవాలని సూచించారు.ఈ వేడుకల్ని ఆదివారం ఉదయం లోపే ముగించేలా నిర్వాహకులు సహకరించాలన్నారు.
- Advertisement -