Thursday, June 5, 2025
E-PAPER
Homeకరీంనగర్లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఇంచార్జి తాహసీల్దార్

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఇంచార్జి తాహసీల్దార్

- Advertisement -

నవతెలంగాణ-రాయికల్: మండలంలోని సింగర్ రావు పేట గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు…రాయికల్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించగా 10వేల రూపాయల లంచం తీసుకుంటూ ఇన్చార్జి తహసీల్దార్ జె.గణేష్ తో పాటుగా ప్రైవేటు డాక్యుమెంట్ రైటర్ ఎండీ ముజాఫర్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడినట్లు ఏసిబి డిఎస్పీ విజయ్ కుమార్ తెలిపారు. మండలంలోని సింగర్ రావు పేట గ్రామానికి చెందిన వ్యవసాయ భూమి సర్వేనెంబర్ 991/5/1/2లో 1.025 భూమి పట్టా మార్పిడి విషయంలో బాధితుడిని 15వేల రూపాయలు లంచం డిమాండ్ చేయగా బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. మంగళవారం సాయంత్రం రాయికల్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల బృందం దాడులు నిర్వహించి తహసీల్దార్ తో పాటుగా మధ్యవర్తిగా వ్యవహరించిన డాక్యుమెంట్ రైటర్ ను అదుపులోకి తీసుకొని కరీంనగర్ లోని ఏసిబి ప్రత్యేక న్యాయస్థానంలో హాజరు పరిచి,కేసు దర్యాప్తు కోసం తదుపరి రిమాండ్ కు తరలించనున్నట్లు ఏసిబి డిఎస్పీ వెల్లడించారు.ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం అడిగిన సందర్భంలో ప్రజలు అవినీతి నిరోధక శాఖ టోల్ ఫ్రీ నెంబర్ 1064 నందు,వాట్సప్ 9440446106 ద్వారా సంప్రదించాలని,బాధితుల వివరాలు గోప్యంగా ఉంచుతామని ఏసీబీ డిఎస్పీ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -