- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వీకెండ్, ఆదివారం సెలవు కావడంతో శ్రీవారి దర్శనానికి భక్తులు క్యూ కట్టారు. ఆదివారం ఉదయానికి 31 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు స్వామివారం దర్శనం 6 గంటల్లో జరుగుతుందని టీటీడీ పేర్కొంది. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 18 గంటలు, కొత్తగా క్యూ లైన్లో వెళ్లేవారికి అంతకంటే ఎక్కువ సమయం పడుతుందని పేర్కొంది. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సుమారు 3-4 గంటల సమయం పడుతుందని తెలిపింది.
- Advertisement -



