- Advertisement -
నవతెలంగాణ – కంఠేశ్వర్
1949 నవంబర్ 26న రాజ్యాంగం ఆమోదం పొందిన రోజును పురస్కరించుకొని జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో భారత రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమం బుధవారం బిఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు,ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి నిర్వహించారు. మాజీమంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, మాజీ ఎమ్మెల్సీ విజి గౌడ్, బోధన్ అయేషా ఫాతిమా, మాజీ మేయర్ నీతూ కిరణ్,నుడా ప్రభాకర్, సిర్ప రాజు, సత్య ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



