- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఐదు టీ20ల సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో మ్యాచ్లో భారత్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సమష్టి పోరాటంతో 187 పరుగుల లక్ష్యాన్ని 18.3 ఓవర్లలో ఛేదించింది. వాషింగ్టన్ సుందర్ (49) వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. అభిషేక్ (25), సూర్య (24), తిలక్ వర్మ (29), జితేశ్ (22) రాణించారు. ఆసీస్ బౌలర్లలో నాథన్ 3 వికెట్లు, స్టాయినిస్, క్సేవియర్ చెరో వికెట్ తీశారు. దీంతో సిరీస్లో ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి.
- Advertisement -



