- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: విమానాల సేవల్లో అంతరాయంపై వివరణ కోరుతూ ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్కు డీజీసీఏ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మొదట 24 గంటల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించిన డీజీసీఏ, ఎయిర్లైన్ ఎగ్జిక్యూటివ్ల అభ్యర్థన మేరకు గడువును మరో 24 గంటలు పొడిగించింది. దీంతో సోమవారం సాయంత్రం 6 గంటల వరకు ఇండిగో సీఈఓ సమాధానం ఇవ్వాల్సి ఉంది. అయితే తాజాగా ఇండిగో సీఈఓ మరోసారి గడువు పెంచాలని కోరారు.
- Advertisement -



