కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గొల్లపల్లి ప్రభాకర్ గౌడ్ 
నవతెలంగాణ – నెల్లికుదురు
హరిత విప్లవం, పేదరిక నిర్మూలనకై కృషి చేసిన భారత దేశపు మొదటి మహిళా ప్రధాని, భారతరత్న ఇందిరా గాంధీ వర్ధంతిని ఘనంగా నిర్వహించినట్లు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గొల్లపల్లి ప్రభాకర్ గౌడ్ తెలిపారు. శుక్రవారం ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించే కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశానికి ఆమె చేసిన సేవలు గుర్తు చేసుకున్నారు. పేదలకు న్యాయం జరిగిందంటే కాంగ్రెస్ తోనే అన్నారు.
ఈ కార్యక్రమంలో డిసిసి ఉపాధ్యక్షులు గుగులోతు బాలాజీ నాయక్, యూత్ మండల అధ్యక్షులు మద్ది రాజేష్, నెల్లికుదురు గ్రామ అధ్యక్షుడు రత్నపురం యాకన్న, కుమ్మరికుంట్ల మౌనెందర్,మాదరి ప్రశాంత్, దాసరి ప్రకాష్,వరిపెల్లి ఉప్పలయ్య, రవి,బెల్లి నర్సయ్య, గుగులోతు భాస్కర్, సురేష్, రాజు, కిషన్. రాము, కళ్యాణ్, కొమురయ్య, తదితరులు పాల్గొన్నారు.

 
                                    