- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్ 
డోంగ్లీ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం  వద్ద శుక్రవారం మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ వర్ధంతిని కాంగ్రెస్ నాయకులు నిర్వహించారు. ఈ క్రమంలో ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశంలో ఎన్నో సంస్కరణలతో అభివృద్ధికి ఇందిరా గాంధీ ఎనలేని కృషి చేశారని, పార్టీ అధ్యక్షుడు గాజు దేశాయ్, ఏఎంసి వైస్ చైర్మన్ పరమేష్ పటేల్ అన్నారు. ఈ కార్యక్రమంలో శివాజీ పటేల్, పురుషోత్తం పటేల్ ఉమాకాంత్ పటేల్, నగేష్ పటేల్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు,
- Advertisement -

 
                                    