Saturday, June 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పేదల సొంతింటి కల నెరవేర్చేందుకే ఇందిరమ్మ పథకం 

పేదల సొంతింటి కల నెరవేర్చేందుకే ఇందిరమ్మ పథకం 

- Advertisement -

నవతెలంగాణ-భూపాలపల్లి
ఇందిరమ్మ పథకంతో పేదల సొంతింటి కల నెరవేర్చేందుకే ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ పథకం ప్రవేశపెట్టిందని, దశలవారీగా పేదలందరికీ ఇండ్లు నిర్మించి ఇస్తామని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు. శుక్రవారం భూపాలపల్లి మండలంలో కమలాపూర్, నాగారం, ఆజంనగర్, నందిగామ, పంబాపూర్ , దీక్షకుంట, దూదేకులపల్లి, గొల్లబుద్దారం, రాంపూర్, కొంపల్లి  గుడాడ్ పల్లి, గొర్లవీడు, వజినేపల్లి, నేరేడుపల్లి, ఎస్.యం కొత్తపల్లి, మోరంచపల్లి, శ్యాంనగర్ గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి, కమలాపూర్ గ్రామంలో మొత్తం 24 మంది లబ్దిదారులకు ఉత్తర్వుల మంజూరి పత్రాలను  అందజేశారు. ఈ సందర్భంగా  ఎమ్మెల్యేకు యూత్ జిల్లా ప్రధాన కార్యదర్శి తోట రంజిత్ నోటు పుస్తకాలను ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం కమలాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వారి ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమ పోస్టర్ ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..  పేదల సొంతింటి కల నెరవేర్చే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం దశలవారీగా ఇందిరమ్మ పథకం ద్వారా పేదలందరికీ ఇండ్లను అందజేస్తామని అన్నారు. ఇందిరమ్మ ఇండ్లు రానివారు ఎలాంటి ఆందోళన చెందరాదని దశలవారీగా అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు సాంక్షన్ చేస్తామని తెలిపారు. ఎలాంటి అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా లబ్ధిదారులకు సాంక్షన్ పత్రాలు అందజేస్తామని తెలిపారు. నియోజకవర్గానికి 3500 ఇండ్ల తో పాటు అదనంగా ఇండ్లను తెచ్చే విధంగా రేవంత్ రెడ్డి తో మాట్లాడుతానని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పేరుతో ఎవరైనా అవినీతికి పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు అందించే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టిఏ మెంబర్ సుంకరి రామచంద్రయ్య, కాంగ్రెస్ నాయకులు తోట సంతోష్, రామినేని రవీందర్, తాటి వెంకన్న, తోట రంజిత్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -