No menu items!
Monday, August 25, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeతెలంగాణ రౌండప్అర్హులకే ఇందిరమ్మ ఇండ్లివ్వాలి..

అర్హులకే ఇందిరమ్మ ఇండ్లివ్వాలి..

- Advertisement -

నవతెలంగాణ – మునుగోడు: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్లను రాజకీయ జోక్యం లేకుండా, అర్హులైన లబ్ధిదారులకే  మంజూరు చేయాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి సాగర్ల మల్లేష్ కోరారు. శనివారం  మండల పరిషత్ కార్యాలయంలో ఇన్చార్జ్ ఎంపీడీవో విజయభాస్కర్ కు పలు డిమాయిలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం  ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్లను అధికార పార్టీ నాయకుల జోక్యంతో అర్హులైన లబ్ధిదారులకు అందాల్సిన సంక్షేమ పథకాలు అందని ద్రాక్షల మారాయని ఆరోపించారు. అర్హులైన లబ్ధిదారులకు అందించే విధంగా అధికారుల పర్యవేక్షణలో సంక్షేమ పథకాలను అందించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. వినతి పత్రం క ఇన్చార్జ్ ఎంపీడీవో విజయభాస్కర్ సానుకూలంగా స్పందించారు. అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా విధులు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యులు మిర్యాల భరత్ , యాస రాణి శ్రీను తదితరులున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad