- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్ ( రాజంపేట్ )
రాజంపేట్ మండలంలోని ఆరేపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేద కుటుంబాల సొంతింటి కల నెరవేరుస్తుందని, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రోజా కృష్ణారావు, ఉప సర్పంచ్ అన్వేష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు యాదవ రెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షుడు దిలీప్, భిక్కనూరు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీరామ్ వెంకటేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డు సభ్యులు, గ్రామస్తులు, తదితరులు ఉన్నారు.
- Advertisement -



