నవతెలంగాణ-భిక్కనూర్
ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లతో భరోసా చేకూరుతుందని ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ అన్నారు. శుక్రవారం భిక్నూర్ మండల కేంద్రంలోని హరిజన వాడ, గిద్ద హరిజనవాడ, కుమ్మరి గల్లిలోని ఇల్లు లేని నిరుపేదలకు మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్ ఇందిరమ్మ ఇల్లు పనులనుకు ముగ్గువేసి ప్రారంభించారు. అనంతరం షబ్బీర్ అలీ మాట్లాడుతూ రాష్ట్రం అప్పుల్లో ఉన్న పేదలకు ఇచ్చిన మాట ప్రకారం హామీలను అమలు చేస్తుందని, కాంగ్రెస్ పార్టీ మాట తప్పదు మడమతిప్పదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇస్తే తప్పకుండా నెరవేరుస్తుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 4 లక్షల 50 వేల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయడం జరిగిందని, ప్రతి నియోజకవర్గానికి 3500 చొప్పున మంజూరయ్యాయన్నారు. కామారెడ్డి నియోజకవర్గానికి 3028 మంది లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగిందని త్వరలో 472 లబ్ధిదారులను ఎంపిక చేస్తారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఆరు హామీలను అమలు చేస్తూ ఎన్నికల్లో హామీ ఇవ్వని పథకాలు కూడా అమలు చేస్తుందన్నారు. 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 2 లక్షల రుణమాఫీ, రైతు భరోస అందజేస్తుందన్నారు. 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు అందిస్తుందని, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఆరోగ్యశ్రీ, సింఎంఆర్ఎఫ్ చెక్కులను సకాలంలో అందజేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం సృష్టించి ఫామ్ హౌస్ లో పడుకొని ఇది చేయలేదు, అది చేయలేదంటున్నారు. స్కాములు, కమిషన్లు, కబ్జాలు చేసి కుటుంబం అభివృద్ధి, పార్టీ నాయకుల అభివృద్ధి కాకుండా పేద ప్రజల అభివృద్ధి కోసం పనిచేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, జిల్లా ఎన్నారై సెల్ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భీమ్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుదర్శన్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీరామ్ వెంకటేష్, పట్టణ అధ్యక్షులు దయాకర్ రెడ్డి, సీనియర్ నాయకులు లింబాద్రి, మోహన్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, ఆయా గ్రామాల గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లుతో భరోసా: మహమ్మద్ షబ్బీర్ ఆలీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES