Wednesday, October 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కొనుగోలు కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి

కొనుగోలు కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి

- Advertisement -

నిర్వాహకుల శిక్షణలో అదరపు కలెక్టర్
నవతెలంగాణ – వనపర్తి 

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్య నాయక్ ఆదేశించారు. బుధవారం అదనపు కలెక్టర్ కొత్తకోట మండల పరీధి లోని పాలెం రైతు వేదికలో, మదనాపూర్ రైతు వేదికల్లో వేర్వేరుగా వరి కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు మండల స్థాయిలో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమానికి హాజరై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఖరీఫ్ 2025-26 సీజన్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని సూచించారు.

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు సన్న, దొడ్డు రకం వరి ధాన్యాన్ని గుర్తించడంలో తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలన్నారు. వర్షాలు వస్తే ఇబ్బందులు లేకుండా టార్పాలిన్ లు అందుబాటులో ఉంచాలని సూచించారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే నిర్దేశించిన మిల్లులకు తరలించాలని చెప్పారు. గన్నీ బ్యాగులు సరిపడునన్ని అందుబాటులో ఉంచాలని సూచించారు. సమావేశంలో జిల్లా సివిల్ సప్లై డి ఎం జగన్, ఆర్డివో సుబ్రహ్మణ్యం, వ్యవసాయ అధికారులు, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -