- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
ప్రజాపాలన పల్లె ప్రగతి 99 రోజుల కార్యాచరణలో భాగంగా భిక్కనూర్ మండలంలో సిద్దిరామేశ్వర నగర్, గుర్జకుంట గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాలను ఎంపిడిఓ రాజ్ కిరణ్ రెడ్డి ఆయా గ్రామాల సర్పంచ్ లు రాణి శ్రీనివాస్, సంతోష్ రెడ్డిలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు అందిస్తున్న సేవలు, పోషకాహారం, పరిశుభ్రత వంటి అంశాలను పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు. అలాగే కేంద్రాల పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శులు అఖిల, బాల క్రిష్ణ, పంచాయతి సిబ్బంది, తదితరులు ఉన్నారు.
- Advertisement -



