– సెన్సెక్స్ 614 పాయింట్ల ర్యాలీ
ముంబయి: రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వడ్డీ రేట్లు తగ్గించనుందనే అంచనాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు పరుగులు పెట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ ఐటీ, ఫార్మా షేర్లు భారీగా లాభపడ్డాయి. కొనుగోళ్ల మద్దతుతో గురువారం బీఎస్ఈ సెన్సెక్స్ 443.79 పాయింట్లు లేదా 0.55 శాతం పెరిగి 81,442కు చేరింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 800 పాయింట్లు పైగా లాభపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 130.7 పాయింట్లు లేదా 0.53 శాతం లాభంతో 24,751 వద్ద ముగిసింది. రియాల్టీ, ఫార్మా, వైద్య రంగాలు 1.75 శాతం, 1.28 శాతం, 1.07 శాతం చొప్పున పెరిగాయి. లోహ, ఐటీ, బ్యాంకింగ్, ఎనర్జీ, ఫైనాన్సీయల్ సర్వీసెస్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల సూచీలు రాణించాయి. ఆర్బీఐ మూడు రోజుల ద్రవ్య పరపతి విధాన సమీక్ష శుక్రవారంతో ముగియనుంది. ఇందులో మరోమారు వడ్డీ రేట్ల తగ్గింపు ఉండొచ్చని నిపుణులు అంచనాలతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపారు.
మార్కెట్లలో వడ్డీ రేట్ల ఆశలు..
- Advertisement -
- Advertisement -