హైదరాబాద్ : దేశంలోని ప్రముఖ ట్రావెల్ అండ్ టూరిజం ఎగ్జిబిషన్లలో ఒకటైన ఇండియా ఇంటర్నేషనల్ ట్రావెల్ మార్ట్ (ఐఐటీఎం) గురువారం హైదరాబాద్లో ప్రారంభమైంది. హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో డిసెంబర్ 4 నుంచి 6వ తేది వరకు మూడు రోజుల పాటు దీన్ని నిర్వహిస్తోన్నట్లు స్ఫియర్ ట్రావెల్ మీడియా డైరెక్టర్ సంజయ్ హాఖూ తెలిపారు. ఈ ప్రదర్శనలో వివిధ రాష్ట్రాల ప్రయాణ, హాస్పిటాలిటీ, ప్రభుత్వ రంగాల స్టాల్స్తో పాటు కొన్ని విదేశీ పర్యటక సంస్థలు కూడా స్టాల్స్ ఏర్పాటు చేశాయన్నారు.. ట్రావెల్ వ్యాపారాల మధ్య అనుసంధానం, పర్యటన అవకాశాల ప్రోత్సాహం మరియు ఈ రంగ అభివద్ధికి దోహదపడే మరో మైలురాయిగా ఈ ఈవెంట్ నిలిచిందన్నారు. ఈ ఎడిషన్లో 10 దేశాలు సహా భారత్లోని 25 రాష్ట్రాల నుంచి 200కు పైగా ఎగ్జిబిటర్లు పాల్గొంటున్నారన్నారు.



