- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్లో భాగంగా అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరగాల్సిన కీలకమైన క్వాలిఫయర్ 2 మ్యాచ్కు వరుణుడు అడ్డుపడ్డాడు. టాస్ వేసిన కొద్దిసేపటికే వర్షం ప్రారంభం కావడంతో మ్యాచ్ నిర్వహణకు అంతరాయం ఏర్పడింది. నేటి మ్యాచ్ లో విజయం సాధించిన జట్టు, ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో అమీతుమీ తేల్చుకోనుంది. అంతకుముందు, టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ సారథి శ్రేయాస్ అయ్యర్ బౌలింగ్ ఎంచుకున్నాడు.
- Advertisement -