Sunday, June 29, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంలెబనాన్‌పై మళ్లీ ఇజ్రాయిల్‌ వైమానిక దాడులు

లెబనాన్‌పై మళ్లీ ఇజ్రాయిల్‌ వైమానిక దాడులు

- Advertisement -

బీరుట్‌ : లెబనాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయిల్‌ ఉల్లంఘించింది. చాలా కాలం తర్వాత లెబనాన్‌పై ఏకపక్షంగా నివాస భవంతిపై వైమానిక దాడులకు దిగింది. శుక్రవారం రాత్రి జరిగిన దాడిలో ఒక మహిళ మరణించగా, డజనుమందికి పైగా గాయపడ్డారని ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. నబతియా ప్రాంతంలో నివాస భవంతిని లక్ష్యంగా చేసుకుని ఈ వైమానిక దాడి జరిగిందని, నగర శివార్లలో జరిగిన దాడుల్లో మరో ఏడుగురు గాయపడ్డారని లెబనాన్‌ ప్రభుత్వ వార్తా సంస్థ నేషనల్‌ న్యూస్‌ ఏజెన్సీ తెలిపింది. ఆకాశంలో విమానాల రొద వినబడుతుండగా, దాడులు జరిగిన ప్రాంతంలో కొండపై నుండి దట్టంగా పొగ కమ్ముకోవడం కనిపిస్తోంది. ఈ మేరకు మీడియా ఫుటేజీ విడుదల చేసింది.
ఒప్పందాన్ని ఇజ్రాయిల్‌ ఉల్లంఘించింది : లెబనాన్‌ అధ్యక్షుడు జోసెఫ్‌ ఔన్‌
తాజాగా దాడులకు పాల్పడడం ద్వారా ఇప్పటికే ఉభయపక్షాలు నవంబరులో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించిందని లెబనాన్‌ అధ్యక్షుడు జోసెఫ్‌ ఔన్‌ విమర్శించారు. దక్షిణ లెబనాన్‌లో ఎలాంటి ప్రభుత్వ ఆయుధాలు లేదా పోరు బాట పట్టే కార్యకర్తలు వుండరాదని కాల్పుల విరమణ ఒప్పందం పేర్కొంటోంది. ఇజ్రాయిల్‌ సైనికులు దక్షిణ లెబనాన్‌ను వీడాలని స్పష్టం చేస్తోంది. ఎందుకంటే అక్కడ లెబనాన్‌ బలగాలను మోహరించాల్సి వుంది. ఒప్పందం నేపథ్యంలో ఏడాదికి పైగా ఇజ్రాయిల్‌, లెబనాన్‌ మధ్య కాల్పులు నిలిచిపోగా, రెండు మాసాల నుండి యుద్ధం ఆగిపోయింది. తాజాగా దాడులు చేయడం ద్వారా ఇజ్రాయిల్‌ మరోసారి తన దురహంకార పూరిత వైఖరిని బయటపెట్టుకుంది.
దక్షిణ లెబనాన్‌లోని నబాతియా జిల్లా మార్జయౌన్‌లో ఇజ్రాయిల్‌ వైమానిక దాడులతో వెలువడుతున్న పొగ

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -