Tuesday, August 12, 2025
E-PAPER
spot_img
Homeఅంతర్జాతీయంగ్రెటా థన్‌బర్గ్‌ను అడ్డుకున్న ఇజ్రాయిల్ సైన్యం

గ్రెటా థన్‌బర్గ్‌ను అడ్డుకున్న ఇజ్రాయిల్ సైన్యం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: పాలస్తీనా వాసులకు మానవతా సహాయం అందించేందుకు వెళ్తున్న పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్ బృందాన్ని ఇజ్రాయిల్ సైన్యం అడ్డుకుంది. ఇజ్రాయిల్‌ అమానుష దాడులతో పాలస్తీనాలో నెలకొన్న మానవతా సంక్షోభంపై ప్రపంచానికి అవగాహన కల్పించడం, ఇజ్రాయిల్‌ సముద్ర దిగ్బంధనాన్ని ఛేదించి మానవతా సహాయం అందించడం లక్ష్యంగా ఈ నౌక గాజా బయల్దేరింది. గ్రెటాతోపాటు పాలస్తీనా సంతతికి చెందిన ఫ్రెంచ్‌ యూరోపియన్‌ పార్లమెంట్‌ సభ్యురాలు రీమా హసన్‌సహా 12మంది కార్యకర్తలు ఫ్రీడమ్‌ ఫ్లోటిల్లా ఆధ్వర్యాన ఈ నెల 1న ఇటాలియన్‌ ఓడరేవు కాటానియా నుంచి మాడ్లీన్‌ నౌకలో బయల్దేరారు. అయితే ఐడీఎఫ్ దళాలు అడ్డుకున్న సమయంలో లైఫ్ జాకెట్లతో చేతులు పైకెత్తి కూర్చున్న వ్యక్తుల ఫొటోను యూరోపియన్ పార్లమెంట్ సభ్యురాలు రిమా హసన్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇటలీలోని ఓడరేవు కాటానియా నుంచి మాడ్లీన్ నౌక బయల్దేరింది. అందులో గ్రెటా థన్‌బర్గ్ కూర్చుని ఉంది. అయితే గ్రెటా థన్‌బర్గ్ ప్రయాణిస్తున్న నౌకను అడ్డుకుంటామని ఆదివారం ఇజ్రాయిల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ తన కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేసింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img