- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ఇజ్రాయిల్ గురువారం జరిపిన దాడుల వల్ల గాజాలో 14 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. గడచిన 24 గంటల్లో 90 మంది మృతి చెందినట్లు గాజా ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. ఇజ్రాయిల్ గాజాతోనే కాకుండా పొరుగు దేశాలను కూడా ఆక్రమించేందుకు ప్రయత్నం చేస్తోంది. తాజాగా వెస్ట్ బ్యాంక్లోని రామల్లాకు ఈశాన్యంగా ఉన్న కాఫర్ మాలెక్పై జరిపిన దాడిలో ముగ్గురు మృతి చెందారు.
- Advertisement -