- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: తెల్లవారుజాము నుండి ఇజ్రాయిల్ దళాలు గాజాపై దాడుల్ని ప్రారంభించాయి. గురువారం వైమానిక, భూతల దాడులకు గాజాలో 55 మంది పాలస్తీనియన్లు మృతి చెందినట్లు వైద్య వర్గాలు తెలిపాయి. ఈ దాడులపై ఐక్యరాజ్యసమితి తీవ్రంగా విమర్శించింది. ఇజ్రాయిల్ ఇంధనాన్ని నిలిపివేయడం వల్ల విద్యుత్ సరఫరా ఆగిపోయి ఆసుపత్రుల్లో రోగులు చనిపోతున్నారని వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు.
- Advertisement -