- పోలీస్ కమీషనర్ సాయి చైతన్య
నవతెలంగాణ-కంఠేశ్వర్: మందులు వాడే కంటే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని మెగా వైద్య శిబిరంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు. ఈ మేరకు మంగళవారం పోలీస్ హెడ్ క్వార్టర్ లో మెగా వైద్య శిబిరం ను పోలీస్ శాఖ ఆధ్వర్యం మల్లారెడ్డి, నారాయణ హాస్పిటల్స్ హైదరాబాద్ వారి సౌజన్యంతో ఈ కార్యాక్రమం నిర్వహించగా ముఖ్య అతిధులుగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య హాజరయ్యారు.
ముందుగా జ్యోతి ప్రజ్వలన అనంతరం మెగా వైద్య శిబిరం ను ప్రారంభించారు.
ఈ సందర్భముగా పోలీస్ కమీషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ.. సిబ్బంది ఎల్లప్పుడు విధులు నిర్వహణలో ఉండటం వలన తమ ఆరోగ్యం పట్టించుకోకపోవడంతో ఎన్నో రకాల అనారోగ్యాలకు గురవుతున్నారని ,ఆరోగ్యం పై అవగాహన ఎంతో ముఖ్యమనియు, సిబ్బంది కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రస్తుత పరిస్థితులలో వ్యాధులు ఏంతో వేగంగా విస్తరిస్తున్నాయన్నారు. ప్రతీ సంవత్సరం ఒక్కసారైన డాక్టర్లను సంప్రదించాలన్నారు. ఈ కార్యాక్రమంలో అదనపు పోలీస్ కమిషనర్ (అడ్మిన్) బస్వారెడ్డి, అదనపు పోలీస్ కమీషనర్ (ఎఆర్) రామ్ చందర్ రావు, నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ ఎసీపీలు రాజా వెంకట్ రెడ్డి, పి. శ్రీనివాసులు, వెంకటేశ్వర్ రెడ్డి, రిజర్వు ఇన్స్పెక్టర్స్ శ్రీనివాస్ (అడ్మిన్), శేఖర్ బాబు (ఎమ్.టి.ఓ), తిరుపతి (వెల్ఫేర్), సతీష్ (హోమ్ గార్డ్సు) పోలీస్ యూనిట్ మెడికల్ ఆఫీసర్ డా.సరళ, డాక్టర్లు సుధాకర్ రావ్ (సీనియర్ కార్డియాక్ సర్జన్) చంద్ర మోహన్ (కార్డియాలాజిస్ట్), (వంశీ) (జనరల్ ఫిజీసియిన్), అఫ్రిన్ (గైనకొలేజిస్ట్), నిఖిత (అన్ కలజీస్ట్) , షాహాభాజ్ హైమద్ (ఆర్థో పెడిక్), జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు షకీల్ పాషా తదితరులు పాల్గొన్నారు.

