ఇండివిజువల్ కేబుల్ ఆపరేటర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు వేషాల రమేష్ బాబు
నవతెలంగాణ – భూపాలపల్లి : ఎన్నో ఏళ్లుగా ప్రజల వినోదానికి అనుగుణంగా కేబుల్ టీవీ ప్రసారాలను కొనసాగిస్తున్న కేబుల్ ఆపరేటర్ల పై ప్రభుత్వం పోల్ టాక్స్ భారం మోపడం సరైంది కాదని ఇండివిజువల్ కేబుల్ ఆపరేటర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు వేషాల రమేష్ బాబు అన్నారు. సోమవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కృష్ణ కాలనీ సింగరేణి మినీ ఫంక్షన్ హాల్ లో జరిగిన ఇండివిజువల్ కేబుల్ ఆపరేటర్ల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ… మూలిగే నక్క పై తాటిపండు పడ్డట్టు ఇప్పటికే నష్టాలలో నడుపుతున్న కేబుల్ టీవీ లపై ప్రభుత్వం టీఎస్ ఎన్పీడీసీఎల్ ద్వారా పోల్ టాక్స్ పేరుతో అదనంగా వాడుతున్న కరెంటు పోల్ లను లెక్కించి పోల్ టాక్స్ కట్టాలంటూ కేబుల్ టీవీ ఆపరేటర్ల పై అదనపు ఆర్థిక భారాన్ని మోపడం హేయమైనా చర్య అని ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తక్షణమే పోల్ టాక్స్ విధానాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు.కేబుల్ టీవీ ఆపరేటర్లను కుటీర పరిశ్రమలు గా గుర్తించి వివిధ శాఖల ద్వారా రుణ సదుపాయం కల్పించి కేబుల్ టీవీ లను ప్రోత్సహించాలని కోరారు. అనంతరం కేబుల్ ఆపరేటర్లు భూపాలపల్లి ఎమ్మెల్యే క్యార్యాలయానికి ర్యాలీగా వెళ్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుకు వినతి పత్రం అందించారు.సానుకూలంగా స్పందించి న ఎమ్మెల్యే విద్యుత్ శాఖ ఎస్ఈ తో ఫోన్లో మాట్లాడారు. అదే విధంగాకేబుల్ ఆపరేటర్ల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా కేబుల్ ఆపరేటర్ల అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
కేబుల్ ఆపరేటర్లపై పోల్ టాక్స్ భారం మోపడం సరైంది కాదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES