Tuesday, June 24, 2025
E-PAPER
Homeతాజా వార్తలుక్రెడాయ్‌ నూతన అధ్యక్షుడిగా జైదీప్‌రెడ్డి

క్రెడాయ్‌ నూతన అధ్యక్షుడిగా జైదీప్‌రెడ్డి

- Advertisement -

– హైదరాబాద్‌ కమిటీ బాధ్యతల స్వీకరణ
నవతెలంగాణ – బిజినెస్‌ బ్యూరో

కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (క్రెడాయ్‌) హైదరాబాద్‌ 2025 -2027 సంవత్సరానికి నూతన మేనేజింగ్‌ కమిటీని ఆ సంస్థ ప్రకటించింది. హైదరాబాద్‌లో క్రెడాయ్‌ కార్యక్రమాలను ముందుకు నడిపించడం, బలోపేతం చేయడం, రంగం అభివృద్ధికి కృషి చేయడం వంటీ బాధ్యతలను నిర్వర్తిస్తారని క్రెడాయ్‌ కమిటీ వెల్లడించింది. క్రెడాయ్‌ హైదరాబాద్‌ నూతన అధ్యక్షుడిగా ఎన్‌. జైదీప్‌ రెడ్డి ఎన్నికయ్యారు. ఇంతక్రితం ఈ హోదాలో ఉన్న రాజశేఖర్‌రెడ్డి నుంచి జైదీప్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ప్రెసిడెంట్‌-ఎలెక్ట్‌గా బి.జగన్నాథ రావు, జనరల్‌ సెక్రెటరీగా క్రాంతి కిరణ్‌ రెడ్డి, కోశాధికారిగా గూడూర్‌ నితీశ్‌ రెడ్డి ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా మనోజ్‌ కుమార్‌ అగర్వాల్‌, కుర్రా శ్రీనాథ్‌, కే.అనిల్‌ రెడ్డి, వై. రవి ప్రసాద్‌, జాయింట్‌ సెక్రెటరీలుగా సంజరు కుమార్‌ బన్సాల్‌, ముసునూరు శ్రీరామ్‌ బాధ్యతలను స్వీకరించారు.
కార్యనిర్వాహక కమిటీ సభ్యులు అడ్డుల గోపాల్‌ రెడ్డి, అలుగుబెల్లి వెంకట్‌ రెడ్డి, బి జైపాల్‌ ఎన్నికయ్యారు. క్రెడాయ్‌ ప్రస్థానంలో తొలిసారిగా కార్యవర్గంలో మహిళకు అవకాశం కల్పిస్తూ కావ్య కావూరిని ఎగ్జిక్యూటివ్‌ సభ్యురాలిగా తీసుకున్నారు.
రెెరా అనుమతులు తప్పక చూసుకోవాలి : జైదీప్‌ రెడ్డి
సరైన ఆధారాలు ఉన్న స్థలాలు మాత్రమే కొనుగోలు చేయాలని నూతన అధ్యక్షుడు జైదీప్‌ రెడ్డి వినియోగదారులకు సూచించారు. వీటికి రెరా అనుమతులు తప్పనిసరిగా ఉండేలా జాగ్రత్త వహించాలని, ప్రీలాంచ్‌లు, ఆఫర్‌లను నమ్మెద్ద న్నారు. గృహ కొనుగోలుదారులకు నమ్మకం, పారదర్శకత, సకాలంలో డెలివరీ ఇవ్వడం ద్వారా క్రెడాయ్‌ పని తీరు మెరగవుతుందని పేర్కొన్నారు. అందరి సహకారంతో రియల్‌ ఎస్టేట్‌ రంగానికి పూర్వ వైభవం తెచ్చేందుకు ఉత్సుకతతో ఎదురు చూస్తున్నామన్నారు. ఈ రంగంలో ఉన్న సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం, వాటి పరిష్కారాలను కనుగొనే బాధ్యత తమపై ఉందన్నారు.
తెలంగాణలో రియాల్టీ పరిస్థితి సాను కూలంగానే ఉందని క్రెడాయ్‌ నేషనల్‌ ప్రెసిడెంట్‌ ఎలెక్ట్‌ జి రామిరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చు కున్న ఒప్పం దాలు, చేపట్టబోయే ప్రాజెక్టులతో ఏడాదిలోగా ఈ రంగం మరింత పుంజుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమం లో క్రెడాయ్‌ ప్రముఖులు సి శేఖర్‌ రెడ్డి, బి జగన్నాథరావు, మనోజ్‌కుమార్‌ అగర్వాల్‌, క్రాంతి కిరణ్‌రెడ్డి, నితీశ్‌రెడ్డి, సంజరుకుమార్‌ బన్సాల్‌, ప్రేమ్‌సాగర్‌ రెడ్డి, జి.రామిరెడ్డి, ఎస్‌.రామ్‌రెడ్డి, జి.యోగానంద్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -