నవతెలంగాణ – హైదరాబాద్; జపాన్ లోని కితాక్యూషూ సిటీ మేయర్ కజుహిసా టకేచీ ప్రతినిధి బృందం కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్కు చేరుకున్నారు. రేపు పరేడ్ గ్రౌండ్స్లో జరిగే తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలకు జపాన్ ప్రతినిధి బృందం హాజరవనుంది. అనంతరం ఐటీసీ కాకతీయ హోటల్లో తెలంగాణ, కితాక్యుషూ పరస్పర సహకార ఒప్పందం చేసుకుంటాయి. ఇటీవల ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనకు వెళ్లిన సందర్భంగా కితాక్యుషూ సిటీని సందర్శించారు. అదే సందర్బంగా హైదరాబాద్కు రావాలని మేయర్ ను ఆహ్వానించారు. ఒకప్పుడు జపాన్లో అత్యంత కాలుష్యంతో ఉన్న సిటీ కితక్యూషూ. గాలి, నీరు, నేల విషపూరితంగా ఉండేవి. ఇప్పుడు ఈ నగరం పర్యావరణ పరిరక్షణలో ప్రపంచానికే ఉత్తమ ఉదాహరణగా నిలిచింది.
హైదరాబాద్కు చేరుకున్న జపాన్ మేయర్ బృందం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES