Tuesday, June 3, 2025
E-PAPER
Homeతాజా వార్తలుహైదరాబాద్​కు చేరుకున్న జపాన్ మేయర్ బృందం..

హైదరాబాద్​కు చేరుకున్న జపాన్ మేయర్ బృందం..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్; జపాన్​ లోని కితాక్యూషూ సిటీ మేయర్ కజుహిసా టకేచీ ప్రతినిధి బృందం కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్​కు చేరుకున్నారు. రేపు పరేడ్​ గ్రౌండ్స్​లో జరిగే తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలకు జపాన్​ ప్రతినిధి బృందం హాజరవనుంది. అనంతరం ఐటీసీ కాకతీయ హోటల్​లో తెలంగాణ, కితాక్యుషూ పరస్పర సహకార ఒప్పందం చేసుకుంటాయి. ఇటీవల ముఖ్యమంత్రి ఎ.రేవంత్​ రెడ్డి జపాన్​ పర్యటనకు వెళ్లిన సందర్భంగా కితాక్యుషూ సిటీని సందర్శించారు. అదే సందర్బంగా హైదరాబాద్​కు రావాలని మేయర్ ను ఆహ్వానించారు. ఒకప్పుడు జపాన్‌లో అత్యంత కాలుష్యంతో ఉన్న సిటీ కితక్యూషూ. గాలి, నీరు, నేల విషపూరితంగా ఉండేవి. ఇప్పుడు ఈ నగరం పర్యావరణ పరిరక్షణలో ప్రపంచానికే ఉత్తమ ఉదాహరణగా నిలిచింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -