- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
తెలంగాణ రాష్ట్ర రూప కర్త, ఉద్యమ కెరటం, మేధావి ఆచార్య కొత్తపల్లి ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని మద్నూర్ మండల తహసీల్దార్ కార్యాలయం లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ ఎం డి ముజీబ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, నీళ్లు – నిధులు నియామకాలు వాటి ప్రాదాన్యత గురించి అర్థం చేయించిన మేధావి ప్రొఫెసర్ జయశంకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో నాయబ్ తహసిల్దార్ శివ రామకృష్ణ, శరత్, గిర్దవార్ ఏం శంకర్, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -